యాప్నగరం

చెరుకుతోటలో చిరుతపులులు.. భయంతో వణుకుతున్న మెదక్ గ్రామాలు

అడవిలో ఉండాల్సిన చిరుతపులులు పొలంలోకి రావడం కలకలం రేపింది. పిల్లల కోసం తల్లి వచ్చే అవకాశం ఉందని తెలిసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Samayam Telugu 24 Nov 2020, 7:12 pm
తోటలో కుక్కలో.. పశువులో కనిపిస్తే ఫర్వాలేదు.. ఎలాగో అదిలించి పంపించేస్తాం.. కానీ ఒక్కసారిగా చిరుతలు కనిపిస్తే.! ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. అదే పరిస్థితి ఎదురైంది. మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతుకి. ఉదయాన్నే తన చెరకు తోటకు వెళ్లిన రైతు తన పొలంలో చిరుతపులి పిల్లలను చూసి షాకయ్యాడు. పిల్లలు ఇక్కడ ఉంటే తల్లి పులి కూడా ఉంటుందేమోనని ఆందోళనకు గురయ్యాడు. వెంటనే గ్రామస్తుల సహకారంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
leopard cubs


జిల్లాలోని హవేళీ ఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్‌కి చెందిన ఓ రైతు చెరకు తోటలో చిరుతపులి పిల్లలు కనిపించాయి. వాటిని చూసి భయాందోళనకు గురైన పొలం యజమాని వెంటనే గ్రామస్తులకు తెలియజేశాడు. అనంతరం అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. సుల్తాన్‌పూర్ వచ్చిన అటవీ శాఖాధికారులు చిరుతపులి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడదే ఆ చుట్టుపక్కల గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

పిల్లలు కనిపించక చిరుతపులి అడవి మొత్తం గాలిస్తుందని.. ఎవ్వరూ అడవిలోకి వెళ్లొద్దని అటవీశాఖాధికారి శ్రీనివాస్ సూచించారు. సుల్తాన్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, గొర్రెల కాపరులు పది రోజుల వరకూ అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ విషయం తెలిసిన ఆయా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చిరుతపులి దాడి చేస్తుందేమోనన్న భయం వెలిబుచ్చుతున్నారు.

Also Read: పెళ్లి మండపంలో దంపతుల పాడుపని.. కామారెడ్డిలో షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.