యాప్నగరం

సిద్దిపేట జిల్లాలో చిరుతపులి మృతి కలకలం.. ఘటనపై పలు అనుమానాలు

leopard: అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ అంశంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఫారెస్ట్ డీఎఫ్‌ఓ శ్రీధర్ రావు తెలిపారు.

Samayam Telugu 16 Apr 2020, 11:46 pm
అనుమానాస్పదంగా చిరుతపులి మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కాసుల బాద్ గ్రామంలోని అడవిలో చిరుతపులి చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని ఫారెస్ట్ డీఎఫ్ఓ శ్రీధర్ రావు వెల్లడించారు. కాసుల బాద్ గ్రామ శివారులోని అడవిలో చిరుతపులి మృతి చెంది పడి ఉందని తెలిపారు. తొలుత ఈ విషయాన్ని గమనించిన తాము అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లుగా గ్రామ సర్పంచ్ బాలరాజ్ వెల్లడించారు.
Samayam Telugu c6a8446d-ff8d-4ead-8f92-cc6767f977de


వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ అంశంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఫారెస్ట్ డీఎఫ్‌ఓ శ్రీధర్ రావు తెలిపారు. శుక్రవారం రోజున పోస్టుమార్టం నిర్వహిస్తామని వారు తెలిపారు.

Also Read: undefined

మరోవైపు, గుజరాత్‌ గాంధీనగర్‌లోని కోలావాడా ఆయుర్వేద ఆస్పత్రిలోకి బుధవారం ఓ చిరుతపురి చొరబడింది. ఆస్పత్రి టాయిలెట్‌లో సిబ్బంది చిరుతను చూసి బెంబేలెత్తిపోయారు. అందరూ బయటకు వెళ్లిపోయి చిరుత బయటకు రాకుండా తలుపులు మూసేసి, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చివరికి చిరుతను బంధించడంతో సిబ్బందితో పాటు రోగులు ఊపిరి పీల్చుకున్నారు.

Must Read: వామ్మో.. సామాజిక దూరం 2022 వరకూ తప్పదా!

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.