యాప్నగరం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో చిరుత కలకలం

ఓ కుక్కను చిరుత లాక్కెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాలేజీ పక్కనే ఉన్న గుట్టల్లోకి చిరుత వెళ్లి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 13 Dec 2020, 7:40 am
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల పులుల సంచారం ఎక్కువైంది. నిత్యం ఏదో ఓ జిల్లాలోని పులి సంచరించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే తాజాగా నగర నడిబొడ్డున చిరుత సంచరిస్తుందన్న వార్త ఇప్పుడు నగరవాసుల్ని భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటివరకు సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం ఆందోళన కలిగిస్తుంటే.. తాజాగా, నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలిలోని ఐటి కారిడార్ లో చిరుత సంచరిస్తుందన్న వార్త కలకలం సృష్టిస్తోంది.
Samayam Telugu చిరుత కలకలం


Read More: గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు దుర్మరణం

గచ్చిబౌలిలోని రొడా మిస్త్రీ కాలేజీలో ఓ కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది. కాలేజీలో చిరుత సంచరించినట్టు తెలిసిన వెంటనే స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి చిరుత కోసం ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, కాలేజీ పక్కన ఉన్న గుట్టల్లోకి చిరుత వెళ్లి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో చిరుత కోసం గాలింపును ముమ్మరం చేశారు. ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించి చిరుతను పట్టే పనిలో పడ్డారు. మరోవైపు అక్కడున్నవారు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటినుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.