యాప్నగరం

అడవి పందుల కోసం వల.. తీరా చూస్తే చిరుత!

Nalgonda జిల్లాలో అడవి పందుల కోసం రైతులు ఏర్పాటు చేసిన వలలో చిరుత పులి చిక్కుకుంది. హైదరాబాద్ నెహ్రూ జూవలాజికల్ పార్క్ సిబ్బంది ఆ చిరుతను రెస్క్యూ చేశారు.

Samayam Telugu 14 Jan 2020, 10:19 pm
డవి పందుల కోసం రైతులు వల ఏర్పాటు చేశారు. మరుసటి రోజు వచ్చి అడవి పందులు చిక్కాయేమో చూద్దామనుకున్నారు. తీరా అక్కడ నుంచి చిరుత గాండ్రింపులు విని అవాక్కయ్యారు. తాము ఏర్పాటు చేసిన వలలో చిరుత చిక్కుకున్నట్లు తెలుసుకున్న రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అగిలాపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu leopard


వలలో చిక్కుకున్న చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ సిబ్బంది సురక్షితంగా బంధించి తీసుకొచ్చారు. అడవి పందులు పంటలపై దాడి చేసి పాడు చేస్తున్నట్లు రైతులు వాపోయారు. వాటిని నిలువరించడానికి వలలు ఏర్పాటు చేయగా.. అందులో చిరుత చిక్కుకున్నట్లు తెలిపారు. వల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఆ చిరుత పులి గాయపడినట్లు తెలుస్తోంది. వలలో చిక్కుకున్న చిరుత పులిని వీడియోలో చూడవచ్చు.

చిరుత వలలో చిక్కుకోవడంతో దాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు అక్కడికి భారీగా తరలివచ్చారు. గ్రామస్థుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పాతబస్తీ నెహ్రు జువలాజికల్ పార్కు సిబ్బంది.. చిరుత పులిని బోనులో బంధించి జూ పార్కుకు తరలించారు. ఈ మేరకు మంగళవారం (జనవరి 14) సాయంత్రం జూ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. ఎన్నికల తనిఖీల్లో విషాదం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.