యాప్నగరం

మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తి.. సీసీఎంబీ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

మృతదేహాల నుంచి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే ముప్పు తక్కువేనని సీసీఎంబీ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. కాకపోతే జాగ్రత్తగా ఉండటం అవసరమన్నారు.

Samayam Telugu 25 Jun 2020, 12:02 pm
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా మరణిస్తోన్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. చాలా సందర్భాల్లో కరోనా టెస్టులు చేయగా.. మరణించిన తర్వాత రిపోర్టులు రావడం.. ఈలోపు అంత్యక్రియలు పూర్తి చేయడం జరుగుతోంది. దీంతో కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మృతదేహాన్ని తాకొద్దని, స్నానం చేయించడం లాంటివేం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu నమూనా చిత్రం
corona dead body


ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాక డెడ్ బాడీ నుంచి ఇన్ఫెక్షన్ సోకుతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ కె. మిశ్రా తెలిపారు. మృతదేహం నుంచి కరోనా సోకే ముప్పు తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. డెడ్ బాడీ నుంచి ఏవైనా స్రావాలు బయటకు వస్తే.. వాటిని తాకితే మాత్రం కోవిడ్ సోకే అవకాశం ఉందని ఆయన తెలిపారు. డెడ్ బాడీలకు కరోనా టెస్టులు చేయడం వల్ల అంతగా ఉపయోగం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.

కరోనా బారిన పడి వ్యక్తి చనిపోయాక మృతదేహంలో వైరస్ బతికే అవకాశాలు సమయం గడిచే కొద్దీ తగ్గుతాయని ఐసీఎంఆర్ గతంలో ప్రకటించింది. కానీ ఎంత సేపటిలో ఆ డెడ్ బాడీ నుంచి వైరస్ మాయం అవుతుందో చెప్పలేమని ఐసీఎంఆర్ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.