యాప్నగరం

జీవిత ఖైదీలకు శుభవార్త.. అక్టోబర్ 2 విడుదల..

రాష్ట్ర హోంశాఖ నుంచి ఖైదీల మార్గదర్శకాల జీఓ నెంబర్ 30ను విడుదల అయ్యింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా 126మంది ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల కానున్నారు.

Samayam Telugu 30 Sep 2020, 8:48 am
తెలంగాణ జైళ్ళలో శిక్షలు అనుభవిస్తున్న జీవిత ఖైదీలకు శుభవార్త అందంది. ఖైదీల విడుదలపై హోం శాఖ కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్త అధ్యక్షతన సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్ రెడ్డి,లా సెక్రటరీ సంతోష్, జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది హాజరై అక్టోబర్ 2న ఖైదీల క్షమాభిక్ష లైన్ క్లియర్ అయింది. ఖైదీల క్షమాభిక్ష ఫైల్ హోం శాఖ నుండి సీఎం వద్దకు వెళ్ళింది. సీఎం సంతకం అయిన వెంటనే గవర్నర్ వద్దకు వెళ్లనుంది.
Samayam Telugu ఖైదీలకు శుభవార్త
jail


Read More: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి కొత్త పార్టీ

గవర్నర్ సంతకం అయిన వెంటనే అక్టోబర్ 2న క్షమాభిక్షపై 126 మంది ఖైదీలకు విముక్తి లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కేంద్ర కారాగారాలలో ఏళ్ల తరబడి శిక్షలు అనుభవిస్తున్న జీవిత ఖైదీల విడుదలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదివారం ఉదయం రాష్ట్ర హోం శాఖ నుండి ఖైదీల మార్గదర్శకాలు జీఓ నెంబర్ 30 విడుదలైంది. ప్రభుత్వ నిర్ణయంతో కుటుంబ స‌భ్యుల విన‌తులు, వ‌య‌సు మీద ప‌డిన‌వారికి, కొన్నేళ్లు శిక్ష పూర్తిచేసుకున్న సత్ప్రవర్తన క‌లిగిన ఖైదీల‌కు ఉప‌శ‌మ‌నం లభించనుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జీవిత ఖైదీలు, వారి కుటుంబసభ్యులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.