యాప్నగరం

మద్యంప్రియులకు గుడ్ న్యూస్.. రాత్రి 8 గంటల వరకు వైన్ షాపులు

Hyderabad: మద్యంప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. ఇకపై లిక్కర్ షాపులు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. 2 గంటల సమయం పెంచడం వల్ల అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

Samayam Telugu 1 Jun 2020, 9:38 pm
ద్యంప్రియులకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రంలో నేటి (జూన్ 1) నుంచి మద్యం షాపులు రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలలో సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో జూన్ 1 నుంచి లిక్కర్ షాపులను ఎనిమిది గంటల వరకు అమ్మకాలు సాగించేలా వెసులుబాటు కల్పించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Samayam Telugu తెలంగాణ వైన్ షాపులు
Telangana Wine Shops


రాష్ట్రంలోని అబ్కారీ శాఖ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, డిప్యూటీ కమిషనర్లు, జాయింట్‌ కమిషనర్లు, అదనపు కమిషనర్లకు సమాచారం ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నిబంధన అమలయ్యేట్లు చూడాలని ఆదేశించారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో మూతబడిన వైన్ షాపులు మే 6 నుంచి తెరుచుకున్న విషయం తెలిసిందే. మే 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంచడానికి అనుమతించారు. తాజాగా ఈ సమయాన్ని మరో రెండు గంటలు పెంచారు. సమయాన్ని పొడిగించడం వల్ల.. మద్యం అమ్మకాలు మరింత పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుందని అటు మద్యం షాపుల నిర్వాహకులు, ఇటు ఆబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: 14 పంటలకు మద్దతు ధర పెంపు.. రైతులకు కేంద్రం శుభవార్త

Must Read: అట్టుడుకుతున్న అమెరికా.. రహస్య బంకర్‌లోకి ట్రంప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.