యాప్నగరం

గచ్చిబౌలిలో భూకంపం.. నిపుణులు ఏమంటున్నారంటే..

Gachibowli: భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Samayam Telugu 16 Oct 2020, 8:08 am
హైదరాబాద్ ప్రజలు ఓ వైపు భారీ వర్షాలతో సతమతం అవుతుంటే గచ్చిబౌలిలో స్వల్ప భూకంపం రావడం కలవర పరుస్తోంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో గురువారం భూ ప్రకంపనలు వచ్చాయి. మై హోం విహంగ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, టీఎన్జీవో 2 కాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు పేర్కొన్నారు. భూమి లోపలి నుంచి శబ్దాలు కూడా వచ్చాయని భయం వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 0.5 నుంచి 0.8 మధ్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
tremors in gachibowli surroundings


గచ్చిబౌలిలో భూ ప్రకంపనలను జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) నిర్ధారించింది. బుధవారం ఉదయం మూడుసార్లు భూకంపం వచ్చినట్లు రికార్డు అయ్యిందని చీఫ్ శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనగేశ్‌ తెలిపారు. ఇటీవల బోరబండలో భూకంపం రావడంతో అక్కడ ఒక కేంద్రం ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలో గచ్చిబౌలిలో వచ్చిన భూకంపం కూడా రికార్డు అయిందని తెలిపారు. కోకాపేట సమీపంలోని టీఎన్జీవో కాలనీని శ్రీనగేష్ గురువారం సందర్శించారు.

ఈ క్రమంలో ఆ ప్రాంతాలను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ ప్రాంతంలో ఒక భూకంప కేంద్రం, త్రిపుల్‌ ఐటీలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడోది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూమి పొరల్లో సర్దుబాటు వల్ల ఈ భూప్రకంపనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.