యాప్నగరం

తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు నిరసన సెగ

గ్రేటర్ ఎన్నికల ప్రచారం నడుస్తోంది. అన్ని పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాయి. అయితే పలువురు నాయకులకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది.

Samayam Telugu 25 Nov 2020, 5:17 pm
జీహెచ్ఎంసీ ఎన్నిక వేళ పలువురు నేతలకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. డివిజన్లల ో పర్యటిస్తతున్న నాయకుల్ని నిలదీస్తున్నారు. వారి ప్రసంగాల్ని అడ్డుకుంటున్నారు. బస్తీల్లోకి రాకుండా కొందరు నిరసనకు దిగుతున్నారు. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు చేదు అనుభవం ఎదురయ్యింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు తార్నాక డివిజన్ లో నిరసన సెగ తగిలింది. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
Samayam Telugu డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు నిరసన సెగ
deputy speaker padma rao


Read More: వైసీపీ సీనియర్ నేత కుమారుడితో ఎంపీ కోమటిరెడ్డి కూతురు వివాహం

డిప్యూటీ స్పీకర్ పద్మారావు తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి మోతె శ్రీలత శోభన్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో బస్తీ వాసులు పద్మారావు పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బస్తిలోకి రాకుండా అడ్డుకున్నారు. వరదలు వచ్చినప్పుడు రాని నువ్వు, ఇప్పుడెందుకు వచ్చావని మానికేశ్వర్ నగర్ బస్తి వాసులు నిలదీసి అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక పద్మారావు చేసేది ఏమిలేక వెనుదిరిగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.