యాప్నగరం

GHMC కమిషనర్‌గా లోకేశ్ నియామకం

GHMC | జీహెచ్‌ఎంసీకి కొత్త కమిషనర్‌ను నియమించారు. దాన కిషోర్‌ను జల మండలికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న లోకేశ్ కుమార్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.

Samayam Telugu 26 Aug 2019, 8:01 pm
గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)కి కొత్త కమిషనర్‌‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న దాన కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రంగారెడ్డి కలెక్టర్‌ లోకేశ్‌ కుమార్‌ను నియమిస్తున్నట్లు సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా ఉన్న హరీశ్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
Samayam Telugu ghmc


దాన కిషోర్ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు, జలమండలి ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇకపై ఆయన జలమండలి ఎండీగా మాత్రమే కొనసాగనున్నారు. దాన కిషోర్‌ ఏడాది కాలంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సేవలు అందించారు. గతేడాది జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డిని బదిలీ చేసి దాన కిషోర్‌కు ఆ బాధ్యతలు అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.