యాప్నగరం

వైర్లతో పిల్లాడిని 2 కి.మీ. లాక్కెళ్లిన లారీ.. వరంగల్‌లో దారుణం

warangal: లారీ అంతే ముందుకు పోతుండడంతో రోడ్డుపై నడిచి వెళ్తున్న మిట్టి రాజు అనే 12 ఏళ్ల బాలుడి కాళ్లకు వైర్లు చుట్టుకున్నాయి. ఇదంతా గమనించని లారీ డ్రైవర్ అంతే ముందుకు పోనిచ్చాడు.

Samayam Telugu 22 May 2020, 11:42 pm
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ లారీ డ్రైవర్‌ వహించిన నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నడికూడ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ నడికుడ గుండా వెళ్తుండగా.. రోడ్డుపై కింది నుంచి వేలాడుతున్న కరెంటు వైర్లు లారీకి తగిలాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ విద్యుత్ వైర్లు తెగి లారీకి చుట్టుకున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Lorry accident


లారీ అంతే ముందుకు పోతుండడంతో రోడ్డుపై నడిచి వెళ్తున్న మిట్టి రాజు అనే 12 ఏళ్ల బాలుడి కాళ్లకు వైర్లు చుట్టుకున్నాయి. ఇదంతా గమనించని లారీ డ్రైవర్ అంతే ముందుకు పోనిచ్చాడు. అలా ఏకంగా బాలుడ్ని 2 కిలో మీటర్ల దూరం వరకు లారీ లాక్కెళ్లింది. ఇది గమనిస్తున్న గ్రామస్తులు ద్విచక్ర వాహనాలపై లారీని అడ్డగించారు. ఈ ప్రమాదంలో బాలుడి శరీరంపై తీవ్రంగా గీరుకుపోయిన గాయాలయ్యాయి. అతడ్ని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్న వారు విచారణ జరుపుతున్నారు.

Also Read: కరోనా వేళ.. హైదరాబాద్‌లో 32 ప్రత్యేక బస్సులుAlso Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.