యాప్నగరం

టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం.. వేగంగా వచ్చి 3 కార్లను గుద్దేసి.. సీసీటీవీ వీడియో

Nizamabad: కామారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు కార్లను ఢీకొట్టి, టోల్ గేట్ డివైడర్ ను ఢీకొని లారీ నిలిచిపోయింది ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

Samayam Telugu 13 Sep 2020, 9:38 pm
జాతీయ రహదారి నెంబరు 44పై ఓ లారీ బీభత్సం రేపింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బ్రేక్ ఫెయిల్ అయి ఈ ఘోరం జరిగింది. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీ చెల్లించే క్రమంలో ముందు మూడు కార్లు ఆగి ఉన్నాయి. ఇంతలో బ్రేకులు ఫెయిల్ అయిన లారీ.. ఆగి ఉన్న మూడు కార్లను వెనుక నుంచి వేగంగా ఢీకొంది. ఈ క్రమంలో డివైడర్‌ను సైతం ఢీకొంది.
Samayam Telugu లారీ ప్రమాదం
Lorry makes an accident at indalwai toll plaza


కామారెడ్డి నుండి నిజామాబాద్ వైపు వేగంగా వస్తున్న లారీ అడుపుచేసే క్రమంలో ఒక్కసారిగా లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు కార్లను ఢీకొట్టి, టోల్ గేట్ డివైడర్ ను ఢీకొని లారీ నిలిచిపోయింది ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం అనంతరం మూడు కార్ల వెనుక భాగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

Also Read: కాలనీలో గుట్టుగా సెక్స్ దందా.. వ్యభిచార గృహంపై పోలీసుల దాడి, వారిలో కీలక వ్యక్తి


Also Read: కేసీఆర్ కాన్వాయ్‌కు అడ్డొచ్చిన కోతుల గుంపు.. సీఎం ఏం చేశారంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.