యాప్నగరం

హైవేపై లారీ బీభత్సం.. 4 కార్ల పైకి దూసుకెళ్లి బోల్తా

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌ సమీపంలో హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా ప్రయాణిస్తూ, అదుపు తప్పి పక్కనే నిలిపి ఉన్న కార్లపైకి దూసుకెళ్లింది.

Samayam Telugu 22 Aug 2019, 9:19 pm
హైదరాబాద్-విజయవాడ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి రోడ్డు పక్కన నిలిపి ఉన్న నాలుగు కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో గురువారం (ఆగస్టు 22) తెల్లవారు జామున 5 గంటలకు చోటు చేసుకుంది.
Samayam Telugu Lorry.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఓ లారీ, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని రామోజీ ఫిలిం సిటీ గేటు సమీపంలో ఓ చౌరస్తా వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. ఒక కరెంట్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. రోడ్డు పక్కనే ఉన్న పాన్ షాప్, టీ దుకాణాలపైకి దూసుకెళ్లి, ఓ హోటల్ ముందు పార్క్ చేసిన కార్లపై పల్టీ కొట్టింది.

Read Also: నగ్న చిత్రాలు పంపాలంటూ యువతికి వేధింపులు.. విద్యార్థి అరెస్టు

ఈ ఘటన వేకువ జామున జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పాన్ షాప్, టీ దుకాణం, కార్లలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. లారీ బోల్తా పడటంతో ఒక బైకు, 4 కార్లు, టీ బండి పూర్తిగా ధ్వంసం అయ్యాయి. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఘటనపై సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ అతివేగం, డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.