యాప్నగరం

పురుగులమందు తాగిన ప్రేమజంట.. యువకుడు మృతి

కులాలు వేరు కావడంతో పెద్దలెవరూ పెళ్లి ఒప్పుకోలేదు. దీంతో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పురుగుల మందు తాగారు యువతీ యువకులు.

Samayam Telugu 19 Jan 2021, 10:42 am
ఆదిలాబాద్‌ జిల్లా ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. వివారాల్లోకి వెళ్తే తలమడుగు మండలం దెగామలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన గూడెం శ్రీరామ్... వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్న క్రమంలో పెద్దలు మాత్రం పెళ్లికి నో అన్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలెవరూ అంగీకరించలేదు.
Samayam Telugu ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
love couple suicide attempt


Read More: మద్యపాన నిషేధం, అన్నింటా ఆదర్శం.. మోట్లతిమ్మాపురం ప్రత్యేకతలివీ..

ఈ క్రమంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో గోడెం శ్రీరామ్‌ మృతిచెందగా.. అపస్మారక స్థితిలోకి చేరుకున్న యువతి ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుల పెద్దలతో పాటు.. ఇరు కుటుంబాలకు చెందిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.