యాప్నగరం

ఒకే చెట్టుకు ఉరేసుకున్న ప్రేమజంట.. నాగర్ కర్నూలులో విషాదం

రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కూడా అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 19 Oct 2020, 12:38 pm
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాగూర్ కర్నూలు జిల్లాలోని
Samayam Telugu ప్రేమ జంట ఆత్మహత్య
love couple suicide

బల్మూర్ మండలంలో ఉన్న బిల్లికల్లు ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More: జర్నలిస్టు కొడుకు కిడ్నాప్.. బాబుకు జ్వరంగా ఉందని కిడ్నాపర్ల ఫోన్ కాల్

బలుమూరు మండలం రుసుల చెరువు అటవీ ప్రాంతంలో అఖిల, అనీల్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కానుగు చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చెంచు జాతికి చెందిన వారుగా గుర్తించారు. అమ్మాయి బిల్లకల్లు, అబ్బాయి చెంచు గూడెం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. గత రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు బైక్ మీద అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయిన తరువాత వీరిద్దరూ ఆత్మహత్య పాల్పడినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.