యాప్నగరం

కలిసి బతకలేక, కలిసి ఆత్మహత్య.. కొత్తగూడెంలో ప్రేమజంట విషాదం

Kothagudem: కలిసి బతకలేక కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువులే కదా అని ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు.

Samayam Telugu 23 Sep 2019, 2:56 pm
లిసి బతికే అవకాశం లేకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం (సెప్టెంబర్ 21) ఉదయం ఈ విషాదం వెలుగులోకి వచ్చింది. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారపాడుకు చెందిన లావుడ్యా సింధు (21), గుగులోత్‌ గోపి (22) అనే యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే మరొకరికి చచ్చేంత ప్రేమ. సమీప బంధువులే కావడంతో పెద్దలు తమ వివాహానికి అంగీకరిస్తారని భావించారు.
Samayam Telugu lover


సింధు, గోపిల ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో నిలదీశారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురయ్యారు. కలిసి బతికే అవకాశం లేకపోవడంతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ అన్నారపాడు గ్రామ శివారులోని పొలాల్లోకి వెళ్లి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

Also Read: గుడికని తీసుకెళ్లి యువతిపై గ్యాంగ్ రేప్.. నిజామాబాద్‌లో ప్రియుడి దారుణం

పొలాల్లో యువతీ యువకులు విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను గుర్తించి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఎస్సై రాజేశ్‌ కుమార్‌ తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Must Read: కమలానికి గులాబీ ముళ్లు.. బీజేపీకి చెక్, కేసీఆర్ కొత్త స్కెచ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.