యాప్నగరం

పురుగుల మందు తాగి.. రెండు ప్రేమ జంటల ఆత్మహత్యాయత్నం

Nizamabad: నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో జరిగిన ఈ ఘటనల్లో ప్రేమికులను స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 23 Feb 2020, 4:26 pm
రాష్ట్రంలో ఒకేరోజు రెండు చోట్ల ప్రేమ జంటలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ రెండు వేర్వేరు ఘటనల్లోనూ పురుగుల మందు తాగి చనిపోయేందుకు ప్రయత్నించడం గమనార్హం. నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో జరిగిన ఈ ఘటనల్లో ప్రేమికులను స్థానికులు ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu images-5


నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అలీసాగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగి ఇద్దరు ప్రేమికులు చనిపోయేందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు మోహన్, బోధన్‌కు చెందిన నవనీత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: కిషన్ రెడ్డికి ఏమీ తెలీదు.. రేవంత్ రెడ్డి మండిపాటు

హైదరాబాద్‌లో వీరిద్దరూ చదువుకొనేటప్పుడు ప్రేమ చిగురించిందని, పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతోనే వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. అలీసాగర్‌ పార్కుకు వచ్చిన వీరిద్దరూ చెరువులో షికారుకు వెళ్లి, ఇద్దరూ పురుగుల మందు తాగినట్లు పార్కు నిర్వహకులు తెలిపారు. ప్రస్తుతం వీరు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు.

Also Read: క్వార్టర్ ఇస్తేనే కరెంట్ పోల్ దిగుతా.. మందుబాబు హల్ చల్

భువనగిరి జిల్లా ఖిల్లాపై పురుగుల మందు తాగి మరో ప్రేమ జంట కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇద్దరూ సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. సిద్దిపేట జిల్లాకు చెందిన స్వాతి, నవీన్‌లు శనివారం ఇంటి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించబోరన్న భయంతోనే వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.