యాప్నగరం

పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య.. ఆసిఫాబాద్‌లో విషాదం

Asifabad: విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ప్రేమ జంట చనిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Samayam Telugu 5 Aug 2020, 10:23 pm
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిక్ల తాండ అటవీ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. వీరిద్దరిలో ప్రియురాలు అక్కడికక్కడే మృతి చెందగా, ప్రియుడు మాత్రం కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇతణ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రేమ జంటను లింగాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయి, జైనూర్ మండలం రాసిమెట్ట గ్రామానికి చెందిన భీమ్ రావ్‌గా పోలీసులు గుర్తించారు.
Samayam Telugu పురుగుమందు తాగి ప్రేమ జంట ఆత్మహత్య.. ఆసిఫాబాద్‌లో దారుణం
Lovers suicide in komaram bheem asifabad district


విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ప్రేమ జంట చనిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకోకపోవడంతో చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.