యాప్నగరం

కరోనాతో డీఎస్పీ మరణం.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం

కరోనా వైరస్ మరో పోలీసు అధికారి ప్రాణాలను బలి తీసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ఏఆర్ విభాగంలో డీఎస్పీగా పని చేస్తోన్న శశిధర్ కోవిడ్ కారణంగా చనిపోయారు.

Samayam Telugu 10 Aug 2020, 7:47 pm
కరోనా వైరస్ మరో ఫ్రంట్ వారియర్‌ను బలి తీసుకుంది. కోవిడ్ బారిన పడి మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ డీఎస్పీ ప్రాణాలు వదిలారు. మహబూబాబాద్ జిల్లా పోలీసు ఆఫీసులో ఏఆర్ విభాగంలో పని చేస్తున్న పీఎస్ శశిధర్ (50) కరోనాతో చనిపోయారు. హైదరాబాద్ నాంపల్లి కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. శశిధర్ మరణ వార్త తెలియగానే ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
Samayam Telugu డీఎస్పీ శశిధర్


శశిధర్ మహబూబాబాద్ జిల్లాలో ఏడాదిన్నరపాటు సేవలు అందించారు. 1996 బ్యాచ్ ఆర్ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన ఆయన.. బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తించారు. తర్వాత కరీంనగర్, సిరిసిల్లలో పని చేసి.. డీఎస్పీగా ప్రమోషన్ పొంది మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చారు. ఆయన స్వస్థలం వరంగల్.

బాచుపల్లి ఎస్సై మహ్మద్ యూసుఫ్ గత గురువారం కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యాధికారి అయిన డాక్టర్ నరేశ్ కుమార్ కూడా కరోనాకు బలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.