యాప్నగరం

సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేద్దాం: డీజీపీ

National Anthem: భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా.. ఆగస్టు 16న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సామూహికంగా నిర్వహించే.. జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ.. విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను డీజీపీ అభినందించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 14 Aug 2022, 1:30 pm

ప్రధానాంశాలు:

  • సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేద్దాం..
  • రాష్ట్ర ప్రజలకు, పోలీస్ శాఖకు పిలుపునిచ్చిన డీజీపీ
  • ఈ కార్యక్రమంలో పోలీసులు కీలకంగా వ్యవహరించాలని సూచన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu collective singing of the national anthem
సామూహిక జాతీయ గీతాలాపన
National Anthem: ఈనెల 16న నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో పాల్గొనేలా పోలీస్ శాఖలోని అన్ని యూనిట్లకు చెందిన అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, మున్సిపల్ వార్డులు, ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, పోలీస్ కార్యాలయాలు, మార్కెట్ స్థలాలు, ఇతర ప్రదేశాల్లో సామూహిక గీతాలాపన చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahendar Reddy) స్పష్టం చేశారు. సామూహిక గానం కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి.. ఉదయం పదకొండున్నరకు ట్రాఫిక్ ను నిలిపివేయాలని సూచించారు. ఈ టైంలో అలారం మోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనాలని డీజీపీ కోరారు. జాతీయ గీతం ఆలపించే సమయంలో.. అత్యంత క్రమశిక్షణతో ఉండాలని సూచించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.