యాప్నగరం

తెలంగాణకి మరో బిగ్‌షాట్.. వందల కోట్ల పెట్టబడులు, ఉద్యోగాలు!

జ్యూయలరీ రంగంలో పేరొందిన సంస్థ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సుమారు 2500 మందికి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని పేర్కొంది.

Samayam Telugu 15 Sep 2021, 7:17 pm
రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. జ్యూయలరీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన మలబార్ గ్రూప్ తెలంగాణలో తమ కంపెనీ ఏర్పాటుకు సంసిద్ధంత వ్యక్తం చేసింది. వందల కోట్ల రూపాయలతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కంపెనీ తెలిపింది. ఈరోజు మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్ సహా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మంత్రి కేటీఆర్‌ని కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశఆరు.
Samayam Telugu మంత్రి కేటీఆర్‌తో మలబార్ ప్రతినిధులు
malabar


రాష్ట్రంలో రూ.750 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు మలబార్ గ్రూప్ పేర్కొంది. తమ కంపెనీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు గోల్డ్ రిఫైనరీ యూనిట్లను నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సుమారు 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మలబార్ గ్రూప్‌ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు తెలంగాణ జిల్లాల్లో ఉన్నారని.. అలాంటి వారికి ఉపాధి అవకాశాలు లభించడం సంతోషించదగ్గ విషయమని కేటీఆర్ అన్నారు. కంపెనీ ఉద్యోగాల్లో స్థానికులను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి తెలియజేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.