యాప్నగరం

సూర్యాపేట: కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు.

Samayam Telugu 28 Mar 2020, 9:56 pm
Samayam Telugu Suryapet
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కరివిరాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరివిరాల గ్రామ రేషన్ డీలర్ వి శ్రీనివాస రావు గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. దీంతో తనకు కరోనా సోకిందనే బెంగ పెట్టుకున్నాడు. చికిత్స కోసం సూర్యాపేట ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అతడికి కరోనా వైరస్‌ వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించారు. జ్వరం తగ్గడానికి మందులు రాసిచ్చి పంపించారు.

వైద్యులు చెప్పినప్పటికీ శ్రీనివాస్ తనకు కరోనా సోకిందని తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం (మార్చి 28) తన వ్యవసాయ భావి వద్దకు వెళ్లిన శ్రీనివాస రావు.. అక్కడ తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. మంటల్లో కాలిపోయి మరణించాడు.

Must Read: వంట చేసి భార్యకు రుచి చూపించిన రేవంత్, నారా లోకేశ్ కరోనా టిప్స్

శ్రీనివాస రావుకు విదేశాలకు వెళ్లి రావడం గానీ, కరోనా బాధితులతో కాంటాక్ట్ అయిన పరిస్థితులు గానీ లేవని పోలీసులు వెల్లడించారు. కేవలం కోవిడ్-19 సోకిందనే భయంతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం అతడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో కలకలం రేపుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: హోం మంత్రి అమిత్ షాకు కరోనా సోకిందా..?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.