యాప్నగరం

కేసీఆర్, హోంమినిస్టర్‌పై అసభ్యకర పోస్టు.. కేసు నమోదు

ముఖ్యమంత్రితో పాటు, హోంమంత్రిపై కూడా కైరుద్దీన్ అనే వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో అతడు పెట్టిన పోస్టుపై మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Samayam Telugu 23 Jun 2021, 9:45 am
సోషల్ మీడియాలో ఎవరూ హద్దులు దాటిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. అసభ్యకర పోస్టులు పెడితే.. కేసులు పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు. తాజాగా సీఎం, హోంమినిస్టర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీపై ఓ వ్యక్తి అసభ్యకర రీతిలో సోషల్ మీడియాలో వ్యాఖ్లయు చేశారు.
Samayam Telugu కేసీఆర్, మహమూద్ అలీ


కిషన్‌బాగ్‌కు చెందిన హకీం సుఫీషా కైరుద్దీన్‌పై, సయీద్ లాయక్ అలీ ఇచ్చిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేసి చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కైరుద్దీన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా సీఎం కేసీఆర్‌, హోంమంత్రి మహమూద్ అలీపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు పోస్టు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు అనంతరం దర్యాప్తు చేసిన పోలీసులు కైరుద్దీన్‌పై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్, హోంమంత్రిపై కైరుద్దీన్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.