యాప్నగరం

వైన్స్ తెరుస్తారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్టు

Uppal: మద్యం షాపులు తెరుస్తారంటూ నకిలీ జీవో రూపొందించిన వ్యక్తి. సోషల్ మీడియాలో వైరల్. నిజమని నమ్మి వైన్ షాపుల ముందు క్యూ. ఆకతాయిని అరెస్టు చేసిన పోలీసులు.

Samayam Telugu 31 Mar 2020, 11:40 pm
ద్యం దుకాణాలు తెరుస్తారంటూ నకిలీ జీవోని సృష్టించిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని ఉప్పల్‌కు చెందిన సన్నీగా గుర్తించారు. మంగళవారం (మార్చి 31) అతడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించినట్లు హైదరాబాద్‌ పోలీసులు వెల్లడించారు. అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని పోలీసులు సూచించారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Samayam Telugu wines


లాక్‌డౌన్ నేపథ్యంలో మద్యం షాపులను మూసేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. గత ఆదివారం (మార్చి 22) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.30 గంటల వరకు లిక్కర్ షాపులు తెరుస్తారని.. ఆబ్కారీ శాఖ విడుదల చేసినట్లుగా నకిలీ జీవో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇదే నిజమని నమ్మి కొంత మంది మద్యం ప్రియులు ఆదివారం వైన్ షాపుల ముందు బారులు తీరడం గమనార్హం.

Also Read: ఆ జీవో చూశారా.. అస్సలు అనుమానం రాకుండా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.