యాప్నగరం

సరూర్‌నగర్‌లో రోడ్డుపై ఉమ్మి వేసిన వ్యక్తి అరెస్టు

Saroornagar: ఎవరైనా రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ఊయటం నేరమని, అలా చేసిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యకరమైన ఈ అలవాట్లను మానుకోవాలని సూచించింది.

Samayam Telugu 10 Apr 2020, 10:14 pm
కరోనా వైరస్‌ను పారదోలే చర్యల్లో భాగంగా ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపైనా ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. ఒకవేళ ఉమ్మి వేస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. సాధారణంగా గుట్కాలు తినే వాళ్ళు ఎక్కువగా రోడ్ల మీద ఉమ్మి వేయడం పరిపాటి. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, రాష్ట్రంలో ఉమ్మి వేసినందుకు తొలి అరెస్టు హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో జరిగింది.
Samayam Telugu WhatsApp Image 2020-04-10 at 9.23.32 PM.


గురువారం ఉదయం పాల వ్యాను డ్రైవర్‌కు అసిస్టెంట్ అయిన ముజేద్ అనే వ్యక్తి సరూర్ నగర్ వైపు వెళ్తున్న సమయంలో అతను రోడ్డుపై ఉమ్మి వేశాడు. అక్కడ దగ్గరలో ఉన్న సరూర్ నగర్ పోలీసులు అది గమనించి వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన రెండు రోజులకే మొదటి కేసు నమోదు అయింది. సెక్షన్ 274, 269 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

Also Read: తెలంగాణకు రిలయన్స్ సంస్థ భారీ విరాళం

ఇకపై ఎవరైనా రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ఊయటం నేరమని, అలా చేసిన వారికి శిక్షలు తప్పవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యకరమైన ఈ అలవాట్లను మానుకోవాలని, దీనివల్ల వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే ఇకపై బహిరంగ ప్రదేశాలలో పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే శిక్షలు తప్పవని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: సీపీ సజ్జనార్ మంచి మనసుకి పోలీసులు ఫిదా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.