యాప్నగరం

దిశపై అభ్యంతరకర పోస్టులు.. గుంటూరులో యువకుడి అరెస్టు

Shamshabad టోల్ ప్లాజా వద్ద సంచలనం సృష్టించిన వైద్యురాలిపై అత్యాచార ఘటనపై అసభ్య పోస్టులు పెట్టినందుకు గాను గుంటూరులో ఓ యువకుడిని అరెస్టు చేశారు.

Samayam Telugu 4 Dec 2019, 11:50 pm
యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన షాద్‌నగర్ హత్యాచార ఘటనపై కొంత మంది వికృతంగా, అసభ్యంగా పోస్టులు, కామెంట్లు చేసి పైశాచికానందాన్ని పొందుతున్నారు. అలాంటి పోస్టులను గుర్తించిన సైబరాబాద్ పోలీసులు.. ఇప్పటికే సుమోటోగా కేసులు నమోదు చేశారు. మంగళవారం నిజామాబాద్‌లో ఓ యువకుడిని అరెస్టు చేశారు. బుధవారం (డిసెంబర్ 4) మరో గుంటూరులో మరో యువకుడిని అరెస్టు చేశారు.
Samayam Telugu దిశ కేసు


గుంటూరుకు చెందిన ఓ యువకుడు స్మైలీ నానీ అనే ఫేస్‌బుక్ ఖాతా నుంచి వైద్యురాలి హత్యాచార ఘటనపై అభ్యంతకరమైన పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని గుంటూరులో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించి విచారిస్తున్నారు.

Also Read: అమ్మాయిలంటే అంత చులకనా.. చిలుకూరు అర్చకులు రంగరాజన్ ఆవేదన

కొంత మంది యువకులు గ్రూప్‌గా ఏర్పడి మహిళను ఉద్దేశించి అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారు. స్మైలీ నానితో పాటు మరికొందరు ఓ గ్రూప్‌గా ఏర్పడి కామెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చాలా మంది అమ్మాయిల వల్ల అబ్బాయిలు నష్టపోతున్నారని.. రేప్ చేయడం తప్పుకాదనే అర్థం వచ్చేలా వీరు పోస్టులు చేసినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.