యాప్నగరం

ఇంటికి నిప్పు.. ఒకరు సజీవదహనం

కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న హనుమంతు ఇంట్లో నిద్రిస్తున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో అతడు మంటల్లో చిక్కుకొని మృతిచెందాడు.

Samayam Telugu 24 Jul 2021, 8:04 am
ఇంటికి నిప్పు అంటుకొని.. ఒకరు సజీవదహనం అయ్యారు. ఈ దుర్ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని ముబారక్‌పూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ఇంటికి నిప్పు అంటుకుంది. అయితే మంటల్లో చిక్కుకొని అదే గ్రామానికి చెందిన వడ్డె హనుమంతు (55) మరణించాడు. హనుమంతు కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే స్థానికులు గమనించేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో హనుమంతు మంటల్లో చిక్కుకొని మృతిచెందాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. డీఎస్పీ సంజీవరావు, సీఐ వెంకటేష్‌లు సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమా లేక మరేదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడికి భార్యా, పిల్లలు ఎవరూ లేరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.