యాప్నగరం

ఎస్ఆర్‌నగర్‌లో దారుణం.. తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని కొడుకు ఆత్మహత్య

ఇంట్లో వాళ్లపై అలిగి గత కొన్నిరోజులుగా బయట రూం అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే అర్థరాత్రి దాటాక రావడంతో ఇంటి యజమాని కూడా తలుపు తీయలేదు.దీంతో పొద్దున్నే రూంకు వెళ్లిన సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 28 Sep 2020, 8:14 am
తల్లిదండ్రులతో గొడవ పడ్డ కొడకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ బల్కంపేటలో జరిగింది. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా, పెద్దాపురం, మండలం, దివిలి చంద్రంపల్లి గ్రామానికి చెందిన చింతాకుల త్రిమూర్తులు రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చింది. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చిన త్రిమూర్తులు ఎస్సార్‌నగర్‌ ఎస్సార్టీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
Samayam Telugu కొడుకు ఆత్మహత్య
man suicide


అతడి కుమారుడు సురేష్‌(20) బల్కంపేటలో డీజే షాపులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి బీజేఆర్‌నగర్‌లో రూంలోనే నిద్రపోతుండేవాడు. అయితే ఏడాది క్రితం అతడి స్నేహితులు గది ఖాళీ చేయడంతో అప్పటినుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. స్నేహితులతో ఉన్నప్పుడు జల్సాలకు అలవాటుపడ్డ సురేష్.. డబ్బుల కోసం తరచూ తల్లిదండ్రుల్ని వేధించేవాడు. అటు లాక్‌డౌన్‌ వల్ల పనులు లేకపోవడంతో డబ్బులివ్వాలని తల్లిదండ్రులను నిత్యం సతాయించేవాడు.

తల్లిదండ్రులు డబ్బులివ్వలేదని బీజేఆర్‌నగర్‌లో పాత రూమ్‌ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. శనివారం రాత్రి పొద్దుపోయాక వెళ్లడంతో ఇంటి యజమాని గేటు తీయలేదు. రాత్రంతా బయట గడిపిన సురేష్‌ ఉదయం గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. మధ్యాహ్నం అవుతున్నా బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.