యాప్నగరం

కన్నతల్లిని వదిలేసి.. కనీసం అంత్యక్రియలకు కూడా రాకుండా, హన్మకొండలో దారుణం

Hanamkonda: హన్మకొండ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిని గెంటేసిన ఓ కుమారుడు.. ఆమె ఇక లేదన్న సమాచారం తెలిసినా కడచూపునకు రాలేదు.

Samayam Telugu 9 Oct 2019, 11:51 pm
న్నతల్లిని ఓ కఠినాత్ముడు నిర్ధాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేస్తే.. ఓ అనాథ ఆశ్రమం అక్కున చేర్చుకుంది. రెండేళ్లుగా అక్కడ ఆశ్రయం పొందిన ఆమె అనారోగ్యంతో మరణించింది. ఆ కుమారుడికి సమాచారం ఇచ్చారు. కానీ, ఆ తల్లికి అంతిమ సంస్కారాలు చేయకపోగా.. అంత్యక్రియలకు రావడానికి కూడా ఆ కొడుకుకు మనసు కరగలేదు. చేసేదేంలేక ఆ ఆశ్రమ నిర్వాహకులే ‘సహృదయం’తో ఆ పని పూర్తి చేశారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటు చేసుకుంది.
Samayam Telugu Representational Photo


శ్యామల అనే వృద్ధురాలిని రెండేళ్ల కిందట అతడి కుమారుడు ఇంటి నుంచి గెంటేశాడు. నాడు వార్తా పత్రికల్లో ఈ ఘటనకు సంబంధించిన కథనం ప్రచురించారు. విషయం తెలుసుకున్న సహృదయ వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆమెను ఆశ్రమంలో చేర్చుకున్నారు. రెండేళ్లుగా ఆమె ప్రశాంత్‌నగర్‌లోని ఈ ఆశ్రమంలోనే ఆశ్రయం పొందారు.

Must Read: పావురాలతో ప్రాణాపాయం .. సకల ఇన్‌ఫెక్షన్లు, మేల్కోకుంటే వణుకే

అనారోగ్యంతో శ్యామల బుధవారం (అక్టోబర్ 9) ఆశ్రమంలోనే మరణించారు. ఆశ్రమ నిర్వాహకులు ఆమె మరణ వార్తను కుమారుడికి తెలిపారు. కానీ, అతడు మాత్రం అంత్యక్రియలకు రాలేనని ఆశ్రమ నిర్వాహకులకు తేల్చి చెప్పాడు. కన్నతల్లి ఇకలేదనే వార్త తెలిసినా ఆ కఠినాత్ముడిలో చలనం లేకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులే శ్యామలకు అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: ఆర్టీసీ సమ్మె ఉధృతం.. 19న తెలంగాణ బంద్!

కన్నతల్లిని కడసారి చూడటానికి ఆసక్తి కనబరచని ఆ కుమారుడిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతికుండగా ఏనాడూ తల్లిని పోషించలేని ఆ పాపాత్ముడు.. కనీసం అంత్యక్రియలకైనా వచ్చుంటే ఆ తల్లి ఆత్మ శాంతించేదేమో అని కంటతడి పెట్టారు. మానవత్వం మంటల్లో కాలిపోతుంటే అక్కడ నుంచి భారమైన హృదయాలతో వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.