యాప్నగరం

సూర్యాపేట జిల్లాలో విషాదం.. అత్తారింటికి వెళ్తూ యువకుడు దుర్మరణం

పొలం పనులు చేసేందుకు ట్రాక్టర్ పలు ఇనుప పరికరాలతో బయల్దేరింది. అదే సమయంలో అటువైపుగా బైకుపై వస్తున్న సంతోష్‌కు ట్రాక్టర్ వెనుక ఉన్న పరికరాలు రాత్రి చీకటి కావడంతో కనిపించలేదు.

Samayam Telugu 5 Aug 2020, 9:37 am
తెలంగాణ సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల్ని కలిసి... అత్తారింటికి వెళ్తున్న యువకుడు అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. పొలం దున్నేందుకు వ్యవసాయ పరికరాలతో వెళ్తున్న ట్రాక్టర్‌ ఢీకొని, ఇనుప నాగలి అతని గొంతుకు బలంగా గుచ్చుకుపోవటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం జంక్షన్‌ వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఖమ్మం పట్టణం వెంకటగిరి ప్రాంతానికి చెందిన బండ్ల సంతోష్‌ .. అదే జిల్లాలోని తిర్మలాయపాలెం మండలం కాకరవాయిలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ వారిని పలకరించి రాత్రి తన అత్తగారు ఊరైన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌)కు బైక్‌పై బయల్దేరాడు.
Samayam Telugu రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
man died in road accident


మరోవైపు పొలం పనులు చేసేందుకు ఓ ట్రాక్టర్‌ ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బోట్యాతండా నుంచి తిర్మలాయపాలెం మండలం సోలిపురంలో వెళ్తోంది. ట్రాక్టర్‌ ఇంజిన్‌కు మించి వెనకవైపు పొడవైన ఇనుప నాగలి అడ్డంగా ఉంచారు. రాత్రి సమయం కావడంతో ఇది చీకట్లో కనిపించక ఎదురుగా బైకుపై వస్తున్న సంతోష్‌ గొంతుభాగంలో లోతుగా గుచ్చుకుంది. కొంతదూరం అలాగే ఈడ్చుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేస్తామని ఎస్సై కె.గోవర్ధన్‌ తెలిపారు. అత్తారింటికి బయల్దేరిన సంతోష్ ఇలా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.