యాప్నగరం

‘అరగంటలో ఫుల్ బాటిల్ లేపేస్తా’ అని పందెం.. చివరికి..

Nizamabad: అవమానంగా భావించిన కాశయ్య, వెంటనే స్నేహితులతో ఫుల్‌ బాటిల్‌ తెప్పించుకున్నాడు. అరగంటలో మొత్తం తాగేస్తానంటూ పందెం కాశాడు. మద్యాన్ని గబగబా తాగడం మొదలుపెట్టాడు.

Samayam Telugu 11 Jan 2020, 9:28 am
తాను మొనగాడినని నిరూపించుకొనేందుకు ఓ వ్యక్తి కాసిన పందెం చివరికి అతని ప్రాణాలు తీసింది. ‘అర గంటలో ఫుల్ బాటిల్ లేపేస్తా’ అని స్నేహితులతో సరదాగా పందెం కాసి చివరికి నిర్జీవుడయ్యాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో జరిగింది. స్నేహితులు సరదాగా అన్న మాటల్ని సీరియస్‌గా తీసుకొని, అతను ఈ కృత్యానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. అరగంటలో ఫుట్‌ బాటిల్‌ మొత్తం తాగేస్తానంటూ సవాల్‌ చేశాడు.
Samayam Telugu Nizamabad alcohol challenge


Also Read: వీడియో: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కత్తి, కర్రసాము

కడమంచి కాశయ్య అనే 35 ఏళ్ల వ్యక్తి స్నేహితులు విసిరిన సవాలు ప్రకారం.. గబగబా మద్యం తాగేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఇతను పాత సామాన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి కాశయ్య తన ఇంట్లోనే స్నేహితులు దుర్గయ్య, సాయిలుతో కలిసి మద్యం తాగాడు. కాసేపటికే కాశయ్య తూలుతుండటంతో కొద్దిపాటి మద్యానికే మత్తెక్కిందా అని స్నేహితులు హేళన చేశారు.

Also Read: మున్సిపల్ ఎన్నికలు: పోటెత్తిన నామినేషన్లు.. అక్కడ మరీ ఎక్కువ

దీన్ని అవమానంగా భావించిన కాశయ్య, వెంటనే స్నేహితులతో ఫుల్‌ బాటిల్‌ తెప్పించుకున్నాడు. అరగంటలో మొత్తం తాగేస్తానంటూ పందెం కాశాడు. మద్యాన్ని గబగబా తాగడం మొదలుపెట్టాడు. తర్వాత కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సాధారణ మత్తు అనుకొని, స్నేహితులు అతడిని వదిలేసి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం కాశయ్య నిద్ర లేవకపోవడంతో కుటుంబసభ్యులు అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

Also Read: మంత్రి సబితకు సీబీఐ కోర్టు సమన్లు.. 17న హాజరుకు ఆదేశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.