యాప్నగరం

తల్లిని కాపాడి ప్రాణాలు విడిచిన కుమారుడు

Karimnagar కాకతీయ కాలువలో విషాద ఘటన చోటు చేసుకుంది. బట్టలు ఉతుకుతూ కాలువలో జారిపడ్డ తల్లిని కాపాడిన కుమారుడు అదే కాలువలో కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యాడు.

Samayam Telugu 14 Jan 2020, 4:24 pm
ల్లి ప్రాణాలను కాపాడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాదమిది. కరీంనగర్ జిల్లాలో కాకతీయ కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్వలో కొట్టుకుపోతున్న తల్లిని ఒడ్డుకు చేర్చిన కుమారుడు.. ప్రమాదవశాత్తూ అదే కాల్వలో కొట్టుకుపోయి ప్రాణాలు విడిచాడు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ధర్మరాజుపల్లిలో సోమవారం (జనవరి 13) ఈ ఘటన జరిగింది. ధర్మరాజుపల్లికి చెందిన జక్కుల సారమ్మ సోమవారం మధ్యాహ్నం బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని కాకతీయ కాల్వ వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు కుమారుడు రవి (26) కూడా వెళ్లాడు.
Samayam Telugu representational Image


కాల్వలో బట్టలు ఉతుకుతుండగా సారమ్మ చేతిలోంచి ఓ చీర జారిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న చీరను అందుకునే క్రమంలో ఆమె కాల్వలోకి జారిపోయింది. ప్రమాదాన్ని గమనించిన కుమారుడు రవి కాల్వలోకి దిగి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ క్రమంలో అతడు కాల్వలోకి జారిపోయి కొట్టుకుపోయాడు.

Must Read: సంచలనం.. కొత్త కానిస్టేబుళ్లలో 300 మందికి నేర చరిత్ర

తన కుమారుడు కాల్వలో కొట్టుకుపోతుండటంతో ఆందోళనకు గురైన సారమ్మ కేకలు వేశారు. దీంతో సమీపంలో పంటపొలాల్లో పనిచేస్తున్న రైతులు పరుగెత్తుకొచ్చారు. కాల్వలోంచి రవిని కాపాడే యత్నం చేయగా అప్పటికే అతడు ఊపిరాడక మరణించాడు. తన ప్రాణాలు నిలిపిన కుమారుడు ఇకలేడనే విషయం తెలిసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. రవికి భార్య లావణ్య, కుమార్తె సాన్విక ఉన్నారు.

Also Read: టీఆర్‌ఎస్‌లో రాజుకున్న ముసలం.. చివరి నిమిషంలో టికెట్ దక్కలేదని..

Must Read: కేసీఆర్‌ను కలిసొచ్చిన జగన్.. తెల్లారే మారిన తెలంగాణ సర్కారు వైఖరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.