యాప్నగరం

ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద నలిగి యువకుడి మృతి

Malakpet: మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసారంబాగ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును బైక్ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

Samayam Telugu 12 Nov 2019, 1:27 pm
హైదరాబాద్ మలక్‌పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వేగంగా వచ్చి అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బస్సు వెనక చక్రాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. తరచూ ఇదే ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Samayam Telugu malakpet
మలక్‌పేట రోడ్డు ప్రమాదం


మృతుడిని నాగోల్‌కు చెందిన చంద్రశేఖర్‌ (20)గా గుర్తించారు. అతడు తన గ్లామర్ వాహనంపై అతివేగంగా వెళ్తూ.. దిల్‌సుఖ్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారాంబాగ్ చౌరస్తాలో మంగళవారం (నవంబర్ 12) ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న మలక్‌పేట్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.