యాప్నగరం

ఆగని ఆన్ లైన్ యాప్ లోన్ వేధింపులు.. ఫ్రాడ్ అంటూ మెసేజ్ రావడంతో

చంద్రమోహన్‌కు వేధింపులు మొదల్వడంతో వెంటనే పోలీసుల్ని ఆశ్రయించాడు. అయిేత పోలీసులుకు చెప్పడంతో అతడికి మరింత మానసిక వేదనకు గరి చేశారు ఆన్ లైన్ యాప్ లోన్ నిర్వాహకులు.

Samayam Telugu 2 Jan 2021, 3:06 pm
ఆన్ లైన్ యాప్ లోన్ వేధింపులు మరో ప్రాణం తీసింది. ఆన్లైన్ యాప్ లోన్ ప్రతినిధుల వేధింపులు భరించలేక మరో వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లిలో నివాసముంటున్న గుజ్జ చంద్రమోహన్ అనేవ్యక్తి ఆన్ లైన్ యాప్ లోన్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఆప్ లోన్ రుణాలను తీర్చాలంటూ ప్రతినిధులు ప్రతి రోజు ఫోన్ చేసి వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో అతను వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
Samayam Telugu చంద్రమోహన్ (ఫైల్ ఫోటో)


Read More: ఆర్టీసీ కార్గోలో మృత పిండం పార్సిల్.. కారణం తెలిస్తే షాక్

అయితే పోలీసులను ఆశ్రయించడంతో అతనికి వేధింపులు మరింత ఎక్కువ అయ్యాయి. రుణం తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడమే కాకుండా అతని ఫోన్ కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ ఇతను ఫ్రాడ్ అంటూ మెసేజ్‌లు పంపించారు. అది తెలుసుకున్న చంద్రమోహన్ తీవ్ర మనస్థాపానికి గురై తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.