యాప్నగరం

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. మహబూబ్‌నగర్‌లో విషాదం

MahaboobNagar | జిల్లాలోని నవాబ్ పేట మండలం విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో భార్య మరణించిన కొద్ది క్షణాల్లోనే మనస్తామంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Samayam Telugu 5 Sep 2019, 11:04 am
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందడాన్ని జీర్ణించుకోలేని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య మరణించిన కొద్ది క్షణాల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (28)కు, యాదమ్మ (23)తో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ కేశరావుపల్లిలోనే నివాసం ఉంటూ తమకున్న పొలం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
Samayam Telugu Man suicide


అయితే రెండు రోజుల కిందట ఏదో పని నిమిత్తం నవాబు పేట మండల కేంద్రానికి వెళ్లారు. అనంతరం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా, అమ్మాపూర్ గేట్ వద్ద యాదమ్మ బైకు మీద నుంచి కిందపడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో భర్త నర్సింహులు.. యాదమ్మను వెంటనే మహబూబ్ నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.
Read Also: ఫ్రెండుని ఆపడానికి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్.. ఊహించని ట్విస్ట్
అయితే చికిత్స పొందుతూ యాదమ్మ బుధవారం ఉదయం మృతిచెందింది. భార్య మరణంతో నర్సింహులు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. యాదమ్మ లేని ఒంటరి జీవితం గడపలేనంటూ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేశవరావుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లయి రెండేళ్లైనా కాకముందే భార్యభర్తలు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Read Also: మ్యూజిక్ డైరెక్టర్‌కు రోడ్డు ప్రమాదం.. కాపాడిన హీరో సాయి ధరమ్ తేజ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.