యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం.. ఆర్టీసీ బస్సు వెనుక టైరు కింద పడి వ్యక్తి మృతి

అంబర్ పేట్ నుంచి రామంతపుర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు.

Samayam Telugu 12 Nov 2020, 10:59 am
రోడ్డు ప్రమాదాలు నగరవాసుల్ని భయాందోళనకులకు గురి చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అంబర్ పెట్ ప్రధాన రహదారి పై ఆర్టీసీ సిటీ బస్ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. అంబర్ పెట్ నుండి రామంతపుర్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. ఆర్టీసీ బస్సు వెనుక టైర్ కింద పడడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Samayam Telugu ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి


Read More: భర్త చనిపోవడంతో ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరకు ఏమైందంటే

మృతుడు ఎవరు ఏంటి అన్న విషయాలు ఇంకా తెలియలేదు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వివరాలు తెలుసుకొని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగిస్తామన్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.