యాప్నగరం

శ్మశానంలో గుట్టుగా లిక్కర్ అమ్మకాలు.. చివరికి..

Liquor Smuggling: ఓ చిన్న రేకుల షెడ్డులో మద్యాన్ని దాచాడు. పోలీసులకు అనుమానం రాకుండా ఇలాంటి ఉపాయాన్ని అనుసరించాడు. ఎవరైనా మద్యం కావాలని అడిగితే అక్కడికి రావాలని చెప్పేవాడు.

Samayam Telugu 1 May 2020, 4:04 pm
లాక్‌ డౌన్ కారణంగా లిక్కర్‌కు డిమాండ్ తగ్గడం లేదు. లాక్ డౌన్ విధించిన మొదట్లో మందుబాబులు వింత పోకడలు పోవడం, కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. వైన్ షాపులు మూతపడి నెల రోజులు దాటుతున్నా అక్రమంగా మద్యం తరలింపు వంటి ఘటనలు ఉంటున్నాయి. కొన్ని చోట్ల గుడుంబా తయారు చేయడం, వాటిపై పోలీసులు నిఘా ఉంచి దాడులు కూడా చేస్తున్నారు. అయితే, పోలీసులకు దొరక్కకుండా మద్యం తరలింపు, అమ్మకాలకు కొంత మంది కొత్త పోకడలు అనుసరిస్తున్నారు.
Samayam Telugu శ్మశానం (ఫైల్ ఫోటో)
liquor in Graveyard


ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన రవి అనే యువకుడు అక్రమంగా మద్యాన్ని నిల్వ ఉంచి, రహస్యంగా విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. అయితే, ఆ మద్యాన్ని నిల్వ ఉంచిన చోటు శ్మశానం కావడం గమనార్హం. అందులో ఉన్న ఓ చిన్న రేకుల షెడ్డులో మద్యాన్ని దాచాడు. పోలీసులకు అనుమానం రాకుండా ఇలాంటి ఉపాయాన్ని అనుసరించాడు. ఎవరైనా మద్యం కావాలని అడిగితే అక్కడికి రావాలని చెప్పేవాడు. ఈ దందా చాలా రోజులుగానే సాగిస్తున్నాడు. చివరకు ఈ శ్మశానం లిక్కర్ బిజినెస్ విషయం తెలిసిపోయింది. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు అక్కడికి చేరుకొని సోదాలు నిర్వహించారు.

శ్మశానం వద్దకు పోలీసులు రావడం గమనించిన రవి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ రేకుల షెడ్డులో ఏకంగా రూ.లక్ష విలువైన మద్యం సరకును పోలీసులు గుర్తించారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసిన నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ దందాపై ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.