యాప్నగరం

కరోనా లక్షణాలతో బాధపడుతూ.. హుస్సేన్ సాగర్‌లో దూకేశాడు

పది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో... హుస్సేన్ సాగర్‌లో దూకేశాడు.

Samayam Telugu 5 Jul 2020, 11:37 am
కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్ సాగర్‌లో దూకి గల్లంతయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన పల్టుపాన్ అనే వ్యక్తి ఉపాధి కోసం తన భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. దూద్ బౌలి నివాసం ఉండే అతడిలో పది రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించాయి. సమీపంలోని క్లినిక్‌లో చూపించుకున్నా ఫలితం లేకపోయింది. దగ్గు, జలుబు, జ్వరం ఎక్కువ కావడంతో మలక్‌పేట్‌లోని యశోదా హాస్పిటల్‌‌కు వెళ్లాడు.
Samayam Telugu hussain sagar


బెడ్లు ఖాళీగా లేకపోవడంతో.. హాస్పిటల్‌లో చేర్చుకోవడం కుదరదని చెప్పారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందన్నా పట్టించుకోలేదు. గాంధీ హాస్పిటల్‌కు వెళ్లాలని సలహా ఇచ్చారు. చల్లటి గాలి కోసమని తన స్నేహితుడితో కలిసి ఆటోలో హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చాడు. ముందుకు నడుచుకుంటూ వెళ్తానని చెప్పిన పల్టుపాన్.. వెళ్లి హుస్సేన్ సాగర్‌లో దూకాడు.

వెంటనే అప్రమత్తమైన అతడి స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. వారు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అతడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. తీవ్ర ఒత్తిడి, బతకనేమో అనే భయంతోనే అతడు ఇలా చేసి ఉంటాడని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.