యాప్నగరం

రవీంద్ర భారతి వద్ద కలకలం.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న వ్యక్తి.. వీడియో

తెలంగాణ వచ్చాక కూడా తనకు ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో బాధితు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కేసీఆర్ సారు, జై తెలంగాణ అంటూ నినాదాలు కూడా చేశాడు.

Samayam Telugu 10 Sep 2020, 5:49 pm
హైదరాబాద్ రవీంద్ర భారతి సమీపంలోని కమాత్ హోటల్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. తెలంగాణ వచ్చిన తరువాత తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆరుచుకుంటు పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడ్ని గుర్తించిన స్థానికులు పోలీసులు మంటల్ని ఆర్పివేసి ఆస్పత్రికి తరలించారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి జై తెలంగాణ, కేసీఆర్ సారు అంటూ పెద్దగా అరుపులు పెట్టాడు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడు.
Samayam Telugu రవీంద్ర భారతి వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం
suicide attempt


Read More: తెలంగాణ వాసులకు షాక్.. లక్షణాలు లేని కరోనా కేసులు లక్షకు పైనే

.ఆత్మహత్యత్నం చేసుకున్న వ్యక్తి నాగులుగా గుర్తించారు. అతని తండ్రి పేరు రాములు. కడ్తల్ గ్రామానికి చెందిన వ్యక్తి. జై తెలంగాణ అని నినాదం ఇచ్చిన వ్యక్తి..నిప్పంటించుకున్న వెంటనే పోలీసులు మంటలు ఆర్పేశారు. అయితే పోలీసులతో తనకు బతకడానికి పని లేదంటూ ఆయన అరిచి చెప్పాడు. సగం శరీరం కాలినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే బాధితుడ్ని ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.