యాప్నగరం

హైదరాబాద్: జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం.. పెద్ద ఎత్తున నష్టం

Madinaguda: అర్ధరాత్రి రెండు గంటల నుంచి మంజీర నీరు లీకై మదీనాగూడ జాతీయ రహదారి పక్కన భవనాల సెల్లార్‌లో నిండిపోయాయి. అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వారికి విషయం తెలిసేలోపే సెల్లార్‌లో 8 అడుగుల మేర నీటిమట్టం నిండిపోయింది.

Samayam Telugu 15 Sep 2020, 12:07 pm
హైదరాబాద్‌లో జలమండలి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మంజీరా తాగునీటి పైపులైన్ మరమ్మతుల పనులు పూర్తి కాకుండానే అధికారులు నీటిని సరఫరా చేశారు. దీంతో గత అర్ధరాత్రి రెండు గంటల నుంచి మంజీర నీరు లీకై మదీనాగూడ జాతీయ రహదారి పక్కన మహాలక్ష్మి ఆర్కేడ్, స్పెన్సర్స్ భవనాల సెల్లార్‌లో నిండిపోయాయి. అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వారికి విషయం తెలిసేలోపే సెల్లార్‌లో 8 అడుగుల మేర నీటిమట్టం నిండిపోయింది. దీంతో 70 కార్లు, 100 ద్విచక్ర వాహనాలు నీట మునిగి భారీ నష్టం ఏర్పడింది.
Samayam Telugu manjeera pipelines leakage at madinaguda apartment sellers filledup with water
హైదరాబాద్: జలమండలి సిబ్బంది నిర్లక్ష్యం.. పెద్ద ఎత్తున నష్టం


సెల్లార్‌లో నీటి మట్టం బాగా పెరగడంతో మహాలక్ష్మి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో నివాసం ఉంటున్న వాచ్‌మెన్ కుటుంబానికి ప్రమాదం ఏర్పడింది. పరిస్థితి గమనించి వారు ముందుగానే సెల్లార్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఘటన నేపథ్యంలో జలమండలి తీరుపై అపార్ట్‌మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటిపై సెల్లార్‌లో ఉన్న సిలిండర్లు, ఇతర గృహోపకరణాలు తేలుతున్నాయి. అధికారులు స్పందించి పంపులు ఏర్పాటు చేసి నీటిని తోడే ప్రక్రియ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.