యాప్నగరం

మన్యంలో కలకలం... మందుపాతర పేల్చేసిన మావోయిస్టులు

మావోలు మందుపాతరతో కలకలం సృష్టించారు. రోడ్డుపై ల్యాండ్ మైన్ పేలడంతో చుట్టుపక్కల జనం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 7 Sep 2020, 8:30 am
తెలంగాణలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందుపాతర పేల్చారు. చర్ల మండలంలోని పెదముసిలేరు గ్రామ శివారులో గల పైడి వాగు వద్ద ప్రధాన రహదారిని మందుపాతర పెట్టి మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో మందుపాతర ధాటికి రహదారిపై 10 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది. రహదారి పేల్సివేత కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Samayam Telugu మందుపారత పేల్చిన మవోలు
maoist blast landmine


శంకర్ ఎన్ కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఆదివారం మన్యంలో బంద్‌కు పిలుపు నిచ్చారు. ఆదివారం రాత్రి 9.45 నిమిషాల సమయంలో ఈ పేలుడు సంభవించింది. మూడు సంవత్సరాల క్రితం పైడి వాగు రహదారిపై ఉన్న వంతెనను నక్సల్స్ పేల్చివేశారు.
బంద్ సందర్భంగా రహదారి పేల్చిన మావోయిస్టులు తమ ఉనికిని చాటుకున్నారు. గత ఏడాది రహదారి నిర్మాణం జరిగే సమయంలోనే ఈ మందు పాతరలను పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.

గుండాల మండలంలో ఈనెల 3న మావోయిస్టు సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దానికి నిరసనగా మావోయిస్టులు ఆదివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మందుపాతర పేల్చి అలజడి రేపారు.గుండాల మండలంలో ఎన్‌కౌంటర్‌ను నిరసనగా బంద్‌ పాటించాలని కోరుతూ చర్ల-శబరి ఏరియాకమిటీ కార్యదర్శి అరుణ, పాల్వంచ-మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి మంతు పేరిట ప్రకటనలు విడుదలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.