యాప్నగరం

గణపతి నిజంగానే లొంగిపోతారా? మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక ప్రకటన

Maoist Party: మావోయిస్టు కేంద్ర కమిటీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది.

Samayam Telugu 3 Sep 2020, 7:40 pm
మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి లొంగుబాటు వార్తలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ ఎట్టకేలకు స్పందించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. ఇది ఒక చౌకబారు ఎత్తుగడ అని, గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని కొట్టిపారేసింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకమని, మీడియాను ఇందులో పావులుగా వాడుకున్నారని లేఖలో కమిటీ స్పష్టం చేసింది. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకున్నారని లేఖ ద్వారా వివరించింది. ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడని పేర్కొంది.
Samayam Telugu గణపతి
Ganapathy


‘సిద్ధాంత పరంగా, రాజకీయంగా మేం దృఢంగా ఉన్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెమటలు పట్టిస్తున్నాం. మా నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారు. ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని మేం పిలుపునిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం.’ అని లేఖలో పేర్కొన్నారు.

అయితే, గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో గణపతి బాధపతుడుని, తెలంగాణ పోలీసులకు అతను లొంగిపోతాడని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ పరిణామం జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ స్పందించి ఆ వార్తలను కొట్టిపారేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.