యాప్నగరం

తెలంగాణలో మళ్లీ రెచ్చిపోయిన మావోయిస్టులు

ఇన్‌ఫార్మర్ నెపంతో మావోలు హోంగార్డును హతమార్చారు. అయితే దీనిపై అధికారులు ఎవరూ ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు.

Samayam Telugu 25 Oct 2020, 12:38 pm
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దసరా పండుగ పూట భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో హోంగార్డును కొట్టి చంపారు. మృతుడు నాయకులపు ఈశ్వర్ ములుగు జిల్లా మల్లంపల్లి వాసిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటన అనంతరం చెన్నాపురం సమీపంలోని గోరుగొండ దగ్గర మావోలు మృతదేహం వదిలివెళ్లారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Samayam Telugu రెచ్చిపోయిన మావోయిస్టులు
maoists attack


అయితే దీనికి సంబంధించి పోలీసులుకానీ ఉన్నతాధికారులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మావోల అణచివేతకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఇదే సమయంలో తమ ఉనికిని చాటుకునేందుకు మావోలు ఎప్పటికప్పుడు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేతను అతి కిరాతంగా హత్య చేసిన విషయం విదితమే.

Read More: మృతదేహానికి మూడు లక్షలు... ప్రైవేట్ ఆస్పత్రి దారుణం

ఆ తర్వాత పోలీసులు తమ కూంబింగ్‌ను మరింత పెంచారు. ఇక అప్పట్నుంచి ములుగుతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు, ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తరుణంలో ములుగులో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఓ వైపు పోలీసులు కూంబింగ్ పెంచడం.. మావోలను ఏరివేయాలని ప్లాన్స్ చేస్తుంటే నక్సలైట్లు మాత్రం ఏదో ఒక రూపంలో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.