యాప్నగరం

పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం.. అదుపుతప్పి వ్యాన్ బోల్తా

పెళ్లికొడుకుతో పాటు దాదాపు యాభైకు పైగా మంది పెల్లి కోసం కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరుకు బయల్దేరారు. గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో రాత్రి ప్రమాదం జరిగి పెెళ్లి వ్యాన్ బోల్తా పడింది.

Samayam Telugu 29 Oct 2020, 7:36 am
నాగర్‌కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి పెళ్లికొడుకుతో సహా పెళ్లికి వెళ్తున్న డీసీఎం వ్యాను బోల్తా పడింది. కొల్లాపూర్ మండలం రామాపురం వద్ద పెళ్లి బృందంతో వ్యాన్ బయల్దేరింది. ఈ ఘటనలో 14 మందికి గాయలయ్యాయి. వేగంగా వెళ్తున్న వాహనం రామాపురం గ్రామ సమీపంలో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో డీసీఎం వ్యాన్‌లో మొత్తం 65 మంది ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu పెళ్లి వ్యాన్ బోల్తా
van accident


Read More: హెలికాఫ్టర్‌లో పెళ్లికి వెళ్లిన హైదరాబాద్ ఫ్యామిలీ... కేసు నమోదు

అయితే వ్యాన్‌లో ఉన్నవారికి స్వల్ఫ గాయాలు మాత్రమే కావడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. బాధితులంతా గద్వాల మండలం జమ్మిచెడుకు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనలో పెళ్లి కుమారుడు రాజు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గురువారం ఉదయం కొల్లాపూర్ మండలం ఎల్లూరులో రాజు వివాహం జరగాల్సి ఉంది. ఇందుకోసం బంధవులు డీసీఎం వ్యాన్‌లో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.