యాప్నగరం

స్పృహ తప్పి పడిపోయిన అమృత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

Amrutha: ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో ఆమె తన తండ్రి భౌతిక కాయాన్ని చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

Samayam Telugu 9 Mar 2020, 8:45 pm
మారుతీరావు కుమార్తె అమృత స్మృహ తప్పి కింద పడిపోయింది. మిర్యాలగూడలోని తన ఇంట్లో ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu amrutha in miryalaguda


ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో ఆమె తన తండ్రి భౌతిక కాయాన్ని చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత ఆమె తన ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు అమృత విలేకరుల సమావేశం నిర్వహించారు. అయినా, వివిధ ఛానెళ్ల మీడియా ప్రతినిధులు ఆమె వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళ్లి, ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె కళ్లు తిరిగి పడిపోయింది.

Also Read: మారుతీరావు పోస్టుమార్టం నివేదిక.. సంచలన అంశాలు గుర్తించిన వైద్యులు

ఓ ఛానెల్‌ ప్రతినిధితో అమృత మాట్లాడుతూ.. ‘‘మారుతీరావును నేను ఏమన్నా చంపానా?’’ అని ప్రశ్నించారు. తండ్రి మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో స్పందించిన అమృత.. ‘‘నా బాబును చూస్తాను అని మా అమ్మ వస్తానంది. నా భర్తను చంపించి పిల్లాడ్ని చూస్తానంటే ఎలా నమ్మేది. నా భర్త ప్రణయ్‌ను చంపింది ఎనిమిది మంది దుండగులు. మారుతీరావు కాకుండా ఇంకా ఏడుగురు నిందితులు వారిలో ఉన్నారు.’’ అని అమృత ఆగ్రహం వ్యక్తం చేసింది.

Must Read: మారుతీరావు ఆత్మహత్యకు అసలు కారణమదే.. వ్యక్తిగత లాయర్ కీలక విషయాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.