యాప్నగరం

మేకలకు మాస్క్.. పులికి కరోనా సోకడంతో ఖమ్మం వాసి అలర్ట్!

Khammam జిల్లాలో మేకలు ఇలా మాస్కులు ధరించి మేతకు బయలుదేరాయి. అమెరికాలోని జూలో పులికి కరోనా సోకడంతో వాటి యజమాని ఇలా అప్రమత్తమయ్యాడు.

Samayam Telugu 8 Apr 2020, 10:28 am
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని 75 శాతానికి పైగా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఆయా దేశాల్లో లాక్‌డౌన్ విధించడం లేదా కరోనా భయంతో ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ స్థితి నెలకొంది. ఇక అత్యవసరమైతే.. మాస్కులు తడిన రక్షణ కవచాలు ధరించి మాత్రమే బయటకు వెళ్తున్నారు. కరోనా కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం తప్పనిసరి అయింది.
Samayam Telugu mask


అయితే.. ఇప్పటివరకూ మనుషులు మాత్రమే మాస్కులు ధరించడం చూశాం. తాజాగా మేకలకూ మాస్కులు కట్టాడు తెలంగాణలోని ఖమ్మం జిల్లా వాసి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ పులికి కరోనా వైరస్ సోకినట్లు వార్త తెలుసుకున్న ఈ యజమాని తాను పెంచుకుంటున్న మూగజీవాల విషయంలో ఇలా జాగ్రత్త పడ్డాడు.

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు తాను పెంచుకుంటున్న మేకల మూతికి మాస్కులు కట్టి మేత కోసం తోడ్కొని వెళ్లాడు. ఆ దృశ్యాలను ప్రచురిస్తూ ‘ఈనాడు’ ఓ కథనం వేసింది. అయితే.. ఈ మాస్కులు ఆ మూగజీవాలకు కరోనా సోకకుండా ఎంతవరకు ఆపుతాయో తెలియదు గానీ.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ‘దృశ్యం’తో మాస్కుల పట్ల అవగాహన మాత్రం పెరిగేలా ఉంది.

Don't Miss: లాక్‌డౌన్ పొడిగిస్తారా.. WHO అలా సూచన చేసిందా?

న్యూయార్క్ జూలో పులికి కరోనా సోకిన వార్తలతో తెలంగాణలో అటవీ శాఖ అధికారులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అప్రమత్తం చేశారు. వేసవి నేపథ్యంలో వన్యప్రాణులకు నీటి కొరత లేకుండా చూడాలని సూచించిన మంత్రి.. ఇదే సమయంలో కరోనా వ్యాపించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో పనులు చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అనుమానం వస్తే వైద్య పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు.

మరోవైపు.. ఖమ్మం జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 6) తొలి కరోనా కేసు నమోదైంది. పెద్దతండాలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడు కూడా ఢిల్లీలోని మర్కజ్ సమావేశాలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. అతడిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలేవీ అతడికి లేవని తెలిపారు. జిల్లాలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.

Photo Credit: eenadu

Watch: పాములను తినడంతో చైనాకు శాపం.. మనల్ని కాపాడటానికి వచ్చిన సర్పం, ఇదిగో ఆ అద్భుతం

Also Read: పులికి క‌రోనా పాజిటివ్.. జంతువుల్లో తొలిసారి, కొత్త టెన్షన్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.