యాప్నగరం

నీట మునిగిన తమ్ముణ్ని కాపాడి.. తమ ప్రాణాలు పోగొట్టుకున్న అన్నాచెల్లెలు

సరదాగా ఈత కోసం నీటి గుంతలో దిగారు. కానీ లోతు ఎక్కువగా ఉండటంతో తమ తమ్ముడు నీట మునగడం గమనించారు. అన్నాచెల్లెలు కలిసి అతణ్ని కాపాడారు. కానీ తాము మాత్రం బలయ్యారు.

Samayam Telugu 1 Oct 2019, 8:38 am
సరదాగా ఈత కొట్టడం కోసం గుంతలో దిగిన తమ తమ్ముడు నీటిలో మునిగిపోవడం గమనించిన అన్నాచెల్లెళ్లు అతణ్ని కాపాడాలని భావించారు. గుంతలో నుంచి అతణ్ని ఒడ్డుకు చేర్చారు. కానీ వారు మాత్రం పైకి రాలేక ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెందిన 20 ఏళ్ల ప్రశాంత్‌, గుండ్లపల్లికి చెందిన 17 ఏళ్ల పావని వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. వినోద్ కుమార్ అనే బాలుడు వీరికి తమ్ముడు అవుతాడు. వీరంతా పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తూప్రాన్‌ మండలం ఘన్‌పూర్‌‌ వెళ్లారు.
Samayam Telugu drow1


మిగతా పిల్లలతో కలిసి వీరంతా ఊరి పక్కనే ఉన్న ఓ నీటి గుంతలో సరదాగా ఈత కొట్టడం కోసం వెళ్లారు. అందరూ కలిసి నీటిలో దిగారు. కాసేపు సరదాగా గడిపాక వినోద్‌ కుమార్‌ నీటిలో మునిగిపోతుండటాన్ని ప్రశాంత్, పావని గమనించారు. అతణ్ని ఎలాగైనా కాపాడాలనే తాపత్రయంతో కాస్త లోతుకు వెళ్లారు. కానీ తమకు ఈత రాదనే సంగతి మరిచారు.

వీరిద్దరూ కష్టపడి వినోద్ మునిగిపోకుండా కాపాడారు. కానీ తాము మాత్రం నీటిలో మునిగిపోయారు. వెంటనే అక్కడే ఆడుకుంటున్న పిల్లలు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వచ్చి గుంతలోకి దిగి ప్రశాంత్, పావనిలను బయటకు తీశారు. కానీ ఊపిరి ఆడకపోవడంతో అప్పటికే వారిద్దరూ ప్రాణాలు వదిలారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.