యాప్నగరం

TS: ఈ 5 జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. కేసీఆర్ కీలక సమీక్ష

Telangana Weather: రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణం స్పందించి సాధారణ జీవనానికి అనుకూలంగా పరిస్థితులను చక్కదిద్దాలని సీఎస్ సూచించారు.

Samayam Telugu 20 Sep 2020, 8:02 pm
కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వర్షాలు అలాగే కొద్ది రోజులు కొనసాగవచ్చునని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు అతి భారీ వర్షాల ముప్పు అధికంగా ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వర్షాల ముప్పు అధికంగా ఉండే జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
weather report


అయితే, రాష్ట్రంలో వర్షాల పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ప్రత్యేక సూచనలు చేశారు. నిరంతరం ఆయా జిల్లాల్లో పరిస్థితులను అప్రమత్తంగా ఉండి పర్యవేక్షిస్తుండాలని సూచించారు. సంబంధిత ఉన్నతాధికారులందరూ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తదనుగుణంగా సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని సీఎస్ ఆదేశించారు.

వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సీఎస్ ఆదేశించారు. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణం స్పందించి సాధారణ జీవనానికి అనుకూలంగా పరిస్థితులను చక్కదిద్దాలని సీఎస్ సూచించారు.

Must Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.