యాప్నగరం

కృష్ణా పరివాహక ప్రాంతంలో వరుస భూప్రకంపనలు.. భయపడుతున్న జనం

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తరచుగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో నదీ తీరం వెంబడి నివసిస్తోన్న గ్రామాల ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు.

Samayam Telugu 25 Jul 2020, 3:26 pm
సూర్యాపేట జిల్లాలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో తరచుగా భూప్రకంపనలు నమోదవుతున్నాయి. రోజుకు 20 సార్లు ప్రకంపనలు వస్తుండటంతో.. బలంగా ఉన్న ఇళ్ల గోడలు సైతం బీటలు వారుతున్నాయి. దీంతో జనం భయపడుతున్నారు. భూమి కంపించిన సమయంలో ఉన్న ఫళంగా ఇంటి నుంచి బయటకు పరిగెడుతున్నారు. చింతపాలెం మండలంలో ప్రకంపనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
Samayam Telugu నమూనా చిత్రం


ఈ ఏడాది జనవరి 26న తెల్లవారు జామున రిక్టర్ స్కేల్ పై 4.6 తీవ్రతో భూమి కంపించింది. గత 50 ఏళ్లలో రాష్ట్రంలో ఈ స్థాయిలో భూప్రకంపనలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జనవరి నెలలో 300 సార్లు భూమి కంపించింది. ఈ నెలలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.

తరచుగా ప్రకపంనలు వస్తుండటంతో.. చింతలపాలెం మండలంలోని దొండపాడు గవర్నమెంట్ స్కూల్‌లో, పాత వెల్లటూరులో భూకంప నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. భూమి లోపల ఏడు కిలోమీటర్ల లోతులోని పొరల్లో పగుళ్లు ఏర్పడటం వల్ల ఈ ప్రకంపనలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.