యాప్నగరం

వద్దన్నా కౌంటింగ్ హాల్‌లోకి అలా వెళ్లిన అభ్యర్థి భర్త.. లాక్కొచ్చిన పోలీసులు

GHMC Elections Results: యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన విషయం పోలీసులకు తెలిసింది.

Samayam Telugu 4 Dec 2020, 4:09 pm
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఎర్రగడ్డ ఎంఐఎం అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫ్ అనుమతి లేకుండా పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లారు. రహస్యంగా ఆయన తన సాక్సులో సెల్ ఫోన్ దాచుకొని వెళ్లడం గమనార్హం. ఎవరూ గుర్తించకుండా సెల్‌ఫోన్‌ను సాక్సులో పెట్టుకుని మరీ కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్లారు. నిజానికి కౌంటింగ్ కేంద్రంలోకి అధికారులు సహా ఎవరూ సెల్‌ఫోన్‌లను తీసుకెళ్లడం నిషేధం.
Samayam Telugu సాక్సులో ఫోన్
MIM corporator husband


యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలోని కౌంటింగ్ కేంద్రానికి ఎంఐఎం పార్టీ అభ్యర్థి షాహినా బేగం భర్త షరీఫుద్దీన్.. అనుమతి లేకుండా సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన విషయం పోలీసులకు తెలిసింది. దీనిని గమనించిన పోలీసులు వెంటనే షరీఫుద్దీన్‌ను కౌంటింగ్ హాల్ నుంచి బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌‌కు ఆయన్ను తరలించారు.

GHMC Elections


మరోవైపు, మధ్యాహ్నం 3.30 సమయానికి టీఆర్ఎస్ 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వ‌ర‌కు 15 స్థానాల్లో గులాబి పార్టీ గెలుపొందింది. సూరారం, కాప్రా, హ‌ఫీజ్‌పేట‌, కొండాపూర్‌, హైద‌ర్‌న‌గ‌ర్‌, భార‌తీ న‌గ‌ర్‌, స‌న‌త్ న‌గ‌ర్‌, కుత్బుల్లాపూర్‌, చింత‌ల్ డివిజ‌న్‌, బోర‌బండ‌, బాలాన‌గ‌ర్‌, రంగారెడ్డి న‌గ‌ర్‌, ఆర్సీ పురం, మెట్టుగూడ‌, యూసఫ్‌గూడ‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు. ఇదే సమయానికి ఎంఐఎం 17 స్థానాలు, బీజేపీ 5 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం 2 స్థానాలకే పరిమితమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.